mt_logo

అసెంబ్లీపై ఎగిరేది టీఆర్ఎస్ జెండానే- ఈటెల రాజేందర్

స్థానిక ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూడా భారీ మెజార్టీ సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎగురబోయేది టీఆర్ఎస్ జెండానే అని, 70నుండి 80సీట్లతో సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కాయని, ప్రజలు కోరుకున్నట్లే టీఆర్ఎస్ పార్టీ గెలిచి తెలంగాణ పునర్నిర్మాణం సమర్ధవంతంగా చేపడుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అజెండా మిగతా 28 రాష్ట్రాలకంటే భిన్నంగా ఉంటుందని, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *