తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై నెలకొన్న సందిగ్ధత తొలగించాలని పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారుల కమిటీలు ఎలా అనుసరిస్తున్నాయి అనే విషయాలను వెంటనే వెబ్ సైట్లలో ఉంచి సమాచారాన్ని అందించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రక్రియ మొదలు పెట్టేముందు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, ఉద్యోగాల సమస్యే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది వంటిదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య, ప్రాంతాల వారీగా ఉన్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారి వివరాలను రోజుకోరకంగా ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులను, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా హెచ్వోడీలలో పదవి పొందిన ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించి ఏ విధానం పాటించబోతున్నారనే విషయం తెలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 60 ఏళ్లుగా హైదరాబాద్ లో పాతుకుపోయి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందుతున్న సీమాంధ్ర ఉద్యోగులు స్థానికులై పోతుంటే తెలంగాణ జిల్లాల ప్రజలు మాత్రం హైదరాబాద్ లో నాన్ లోకల్ కాటగిరీ కిందకు వస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమంగా సీమాంధ్ర నుండి వచ్చి ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారని, వారంతా రాబోయే తెలంగాణ ప్రభుత్వానికి భారం కానున్నారని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఉద్యోగి జన్మస్థలాన్ని, చదువుకున్న ప్రాంత వివరాలను ఆయా శాఖల వెబ్ సైట్ లో ఉంచాలని, జన్మస్థలం ఆధారంగా రెండు రాష్ట్రాలకూ ఉద్యోగుల పంపిణీ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- Revanth’s decision to reduce Telangana districts arbitrary and shortsighted
- Revanth Reddy, the most dedicated karyakarta of the BJP, writes KTR
- 6 reasons why the Congress can’t fight the BJP
- How Congress secretly boosting BJP’s chances in 6 seats in Telangana, writes Padma Rao Goud
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- తెలంగాణలో జిల్లాల కుదింపు నిర్ణయం అసంబద్ధం, అవివేకం
- బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే: హరీష్ రావు
- కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్గిరి కార్యకర్తలతో కేటీఆర్
- లోక్సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు
- బండి సంజయ్కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టింది: కేటీఆర్
- మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు