mt_logo

ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఖాయం- కమల్‌నాథ్

శుక్రవారం ఒక ఇంగ్లీషు చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తెలియజేయడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని తెలుస్తుంది. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను మరింత పొడిగిస్తామని కూడా చెప్పారు. ఇదే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెంచిన గడువు ఉపయోగించుకొని తెలంగాణ బిల్లుపై త్వరగా చర్చ ముగించి పార్లమెంటుకు పంపిస్తే బిల్లును ఆమోదం పొందేలా చేస్తామని అన్నారు. అసెంబ్లీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నా ఏమీ కాదని, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *