mt_logo

తెలంగాణ అభ్యర్ధులకు మద్ధతుగా నెటిజెన్స్ ఫోరం ప్రచారం

తెలంగాణ నెటిజెన్స్ ఫోరం సభ్యులు మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ అభ్యర్ధులకు మద్ధతుగా ప్రచారం చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి నాగం జనార్ధన్ రెడ్డికి, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావుకు మద్ధతుగా వీరి ప్రచారం సాగింది.

తెలంగాణ కొరకు త్యాగం చెసిన వారినే గెలిపించాలని, ఈ ఉపఎన్నికలు సమైక్యవాదానికి తెలంగాణవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఈ యుద్ధంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలను బొందపెట్టి తెలంగాణవాదాన్ని గెలిపించాలని వారు గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. నెటిజెన్స్ ఫోరం ప్రచారానికి ప్రజల నుండి పూర్తి మద్ధతు లబించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ నెటిజెన్స్ ఫోరం సభ్యులు శ్రీనివాస్ భండారి, సత్య రాపెల్లి, కరుణాకర్, భరత్, ఉమా మహేశ్, జయవీర్ కోటగిరి, అరుణ్ కుమార్, కర్రె మల్లి, రాజ్ కిరణ్, సుమంత్, అశోక్, ఫణీంద్ర, నిఖిల్ గండ్ర పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలు కింద చూడొచ్చు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *