mt_logo

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 23వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

ఇదిలాఉండగా మార్చి 14న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానంలో 5.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. నేటి నుండి 5 రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *