ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 19న ఉదయం గం. 11.30 ని.లకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

