mt_logo

తెలంగాణ ఇచ్చి తీరుతాం- దిగ్విజయ్ సింగ్

యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడంలో వెనక్కు తగ్గదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం డిల్లీలోని తననివాసంలో విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇచ్చిన నోటీస్ ను ఆయన తేలికగా తీసుకున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడిలా చేయడం భావ్యం కాదని, బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏం చేశారని విమర్శించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయడం సరైనది కాదంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోకముందు ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజలకు ఏరకమైన ఇబ్బందులు రానీయమని భరోసా ఇచ్చారు. సీమాంధ్ర బిల్లును చెత్తకుండీలో వేయాలన్న సీఎం మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *