ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు విపక్షాల ఆందోళనల మద్య కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. గంటపాటు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేయడంతో చైర్మన్ స్థానంలో ఉన్న కురియన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వీధిరౌడీలా ప్రవర్తించడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ సభకు తెలంగాణ బిల్లు వచ్చిందని ప్రకటన చేస్తుండగా సీఎం రమేశ్ ఉన్మాదిలా ఆయన చేతిలోని బిల్లు ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించాడు. పెద్దవాడు అని కూడా లెక్కచేయకుండా దాడి చేయడంపై రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి రమేష్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రమంత్రి చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి నిల్చోవడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహంతో మీరు నిల్చునేది ఉంటే రాజీనామా చేసి నుంచోవాలని అన్నారు. తెలంగాణ సహా అన్ని బిల్లులపై చర్చ కొనసాగాలని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కురియన్ ఆదేశించినా, సీమాంధ్ర ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, కేవీపీ సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని పోడియం ముందు నిల్చుని ఆందోళన చేపట్టడంతో సభ సాయంత్రం నాలుగుగంటలకు వాయిదా పడింది.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్