mt_logo

స్థానిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడు

రాష్ట్రవ్యాప్తంగా గతనెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు ఎక్కడా తగ్గలేదు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన 6392 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ ల్లో 183 జెడ్పీటీసీ సీట్లు, 1828ఎంపీటీసీ సీట్లు కైవసం చేసుకుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాపరిషత్ స్థానాలను సొంతం చేసుకుంది. కాగా మరో రెండు జెడ్పీలను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది.

మొత్తం మీద ఉత్తరతెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురే లేకుండా పోయింది. అటు దక్షిణ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీతో నువ్వానేనా? అన్నట్లుగా పోటీ కొనసాగింది. నల్గొండ, రంగారెడ్డి జెడ్పీ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా, టీడీపీ ఒక్క ఖమ్మం జిల్లాలో పట్టు సాధించింది. ఖమ్మం మినహా ఏ జిల్లాలోనూ టీడీపీ జెడ్పీటీసీలను గెలవలేకపోయింది. బీజేపీ ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలవలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *