mt_logo

ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛను ప్రతి నెలా విడుదల

ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఈ మేరకు 2021 జూన్ మాసం నుండి క్రమం తప్పకుండా నగదు మొత్తాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ విడుదల చేస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు పది వేల రూపాయల చొప్పున ప్రత్యేక పింఛనులను ప్రతినెలా విడుదల చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. జూన్ మాసానికి గాను చెక్ నెంబర్ 10328469 ద్వారా జూలై 24న, జూలై మాసానికి గాను చెక్ నెంబర్ 11740033 ద్వారా ఆగస్టు 10 న, ఆగస్టు మాసానికి గాను చెక్ నెంబర్ 15972986, సెప్టెంబర్ 9 న విడుదల చేశామని తెలిపారు. పింఛను చెల్లింపులో ఏవిధమైన జాప్యం లేదని, ఈ ముగ్గురు కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం అందించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *