తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ కురియన్ వ్యవహరించిన తీరుపట్ల సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. సీమాంధ్ర సభ్యులు ఎంత విసిగించినా తట్టుకుని సభను నడిపి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపేలా చేసినందుకు కురియన్ కు సభ్యులేకాక ప్రజలు కూడా అభినందనలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం సభ్యులంతా హుందాగా ప్రవర్తించి ఒకరినొకరు కీర్తించుకున్నారు. కురియన్ మాట్లాడుతూ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అది ఎంతో విలువైనదని అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే సమయంలో సీమాంధ్ర టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఇది పెద్దల సభ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వెంటనే సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు.
మరోపక్క లోక్ సభలో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పలువురిపై పొగడ్తలజల్లు కురిపించి అసలైన రాజనీతిజ్ఞుడు అనిపించుకున్నారు. తెలంగాణ బిల్లుకు సహకరించిన అన్ని ప్రతిపక్ష, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ను, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చి ఉండటం వల్ల వెనక్కు పోకుండా మద్దతు ఇచ్చారని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సహకారం లేకుండా ఏదీ జరగదని షిండే పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన తెలంగాణ బిల్లుపై చర్చను నడిపి ఆమోదం పొందేలా చేసిన స్పీకర్ మీరాకుమార్ ను ఆయన ప్రశంసించారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!