mt_logo

“బిల్లుపై చర్చకే సీమాంధ్ర నాయకులు భయపడుతున్నారు”

విభజన బిల్లును పూర్తిగా చదివితే అందులోని అనుమానాలు నివృత్తి అవుతాయని, చదవకుండా బిల్లుపై చర్చ జరక్కుండా ఎన్ని రోజులు ఆపుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు. బుధవారం నాడు అసెంబ్లీ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజన బిల్లుపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చర్చ అంటేనే భయపడుతున్నారని ఆయన వివరించారు. ఏమైనా అభ్యంతరాలుంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చెప్పాలని, అలా కాకుండా సభకు అడ్డుపడడం ఎంత వరకూ సమంజసం అని అన్నారు. హైదరాబాద్ పై ఏ విధమైన ఆంక్షలు తాము ఒప్పుకోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *