హైదరాబాద్ నగరంపై మరోసారి మతం పేరుతో విషం కక్కేందుకు సిద్ధమైంది ఆర్ఎస్ఎస్ సంస్థ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరు మార్పుపై ఆర్ఎస్ఎస్ చిచ్చు రాజేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల సమన్వయ్ బైఠక్ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమం షెడ్యూల్ను ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్లో జరగనుంది’ అంటూ ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. ఇందులో హైదరాబాద్కు బదులుగా భాగ్యనగర్ అని పేర్కొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేపుతోంది. గత అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫైజాబాద్ను అయోధ్యగా, అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చినట్లుగా హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగర్గా మారుస్తామనగా.. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా మరోసారి భాగ్యనగర్ పేరుతో ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు.. హరీష్ రావు ప్రజెంటేషన్
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్
