mt_logo

రేవంత్ రెడ్డి లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు: అచ్చంపేటలో కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు.. మరికొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాకపోతుండే.. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలే .. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం లేదు… లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరు..లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాతబద్ధులు మళ్ళీ బయటకి వస్తున్నాయి అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమైనాయి.. ఇదేనా మార్పు అంటే? మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదు… అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారు అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఆడబిడ్డలకి రూ. 2,500 ప్రతినెలా ఇస్తామన్నారు.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ ₹4,000 చొప్పున ఇస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు. వాళ్లందరి నెలకు రూ. 2,500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నడు కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాఅన్నాడు, కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారు అని ఎద్దేవా చేశారు.

వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాము శ్రీకృష్ణుడు  శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం.. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మా పార్టీ పైన, మా పార్టీ అధినేతపైన అడ్డగోలుగా విమర్శలు చేశారు అని తెలిపారు.

పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాలపాటు కష్టపడి పని చేశారు. వారందరికీ భవిష్యత్తు పైన భరోసా ఉంది నమ్మకం ఉన్నది. పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక్క సంవత్సరం కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా… తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని అన్నారు.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరు.. మోడీ హవా లేదు.. ఏంలేదు. పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోడీ మనకు ఎందుకు అలోచించాలి. మన కృష్ణ నదిపైన ఉన్న నీళ్లన్ననింటిని కేఆర్ఎంబీకి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మన పార్టీ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేఆర్ఎంబీకి ఇయ్యలేనని తీర్మానం పెట్టిండు.. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బకొడుతున్నాయి అని తెలిపారు.

అందుకే ఏ రోజు అయినా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాపాడబడతాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారును వంద కిలోమీటర్ల స్పీడ్‌తో నడిపిద్దాం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం మాకు ఉన్నది అన్ కేటీఆర్ అన్నారు.