హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం నమోదయ్యింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దించింది. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

