త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా గణపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ నేతలకు ప్రజలు ఓటుద్వారా గుణపాఠం చెప్పారని, అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్న వారి కలలు కల్లలేనని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్ఎస్ వల్లే సాధ్యమైందని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆంధ్రా పార్టీలకు ఈ విషయం అర్థమవుతుందని, మెజార్టీ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.