రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయ్యింది. కమల్నాథన్, ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికలు తయారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాకులోని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని, కమల్నాథన్ కమిటీని, ప్రత్యూష్ సిన్హా కమిటీని కలిసి ఉద్యోగుల విభజనకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించారని సమాచారం. ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయా అని విలేకరులు ప్రశ్నించగా మహంతి సమాధానం చెప్పడానికి నిరాకరించారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు, ఆప్షన్లపై సీరియస్గానే చర్చ జరిగినట్లు, ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని తెలిసింది.
ఈనెల 24లోగా విభజన ప్రక్రియ పూర్తిచేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయడంతో వివిధ ఉద్యోగసంఘాల వద్దనుండి సేకరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 42:58 నిష్పత్తిలో ఉద్యోగులను విభజించారని, ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామని కమిటీ ఇప్పటికే తెలిపింది.
ఇదిలాఉండగా, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు వీ శ్రీనివాస్గౌడ్ ఉద్యోగులకు ఆప్షన్లు, డిప్యుటేషన్లు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ వెళ్ళి కమల్నాథన్ కమిటీని, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిసి ఒక మెమొరాండంను సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాలకోసమే అని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులను తెలంగాణలో కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అర్థం లేదని, ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు ఉండకూడదని, ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం ఉండకూడదనేదే తమ లక్ష్యమని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ భవన్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను చూడటానికి ఆంధ్రప్రాంతం వారిని కేటాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు