mt_logo

పదవులు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం- ఈటెల రాజేందర్

ఉద్యమ సమయంలో ప్రజల సమస్యలు తమకు తెలిశాయని, అవే సమస్యలపై మళ్ళీ వారు తమను అడిగే అవకాశం ఇవ్వకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పదవులు వచ్చినంత మాత్రాన తాము ఎక్కడికీ పోమని, ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న మంచినీటి పనులు, గంగపుత్రుల సంఘం నూతన హాస్టల్ భవనాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం పైనే తమకు ప్రేమ ఉంటుంది తప్ప పదవులపై కాదని అన్నారు.

కులవృత్తుల్లో మరణించే వారికి ఆర్ధిక సాయం అందించేందుకు గీత, మత్స్యకార్మికులకు నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచామని, అన్ని కులవృత్తులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఈటెల చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని అన్ని సంఘాల భవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, తమకు ఏ విషయంలోనూ వివక్ష లేదని స్పష్టం చేశారు. కుల సంఘాల సమస్యల పరిష్కారానికి నాయకులు పైరవీలు చేసే అవసరం రాదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *