తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే అటవీశాఖ కొనుగోలు చేసిన 50 కొత్త వాహనాలైన బోలేరో, స్కార్పియో, జీప్ లన్నిట్నీ రాయలసీమకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కిరణ్ రాజీనామా చేసే కొద్ది రోజులముందు హడావిడిగా ఈ వాహనాల కొనుగోలు ఫైలుపై సంతకం చేయగా నాలుగు కోట్లు వెంటనే శాంక్షన్ అయ్యాయి. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్ సాకుచూపి వాహనాలను సీమకు తరలించారు. అదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీఎస్ఎస్ రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంవల్ల ఆయన ఆదేశాలమేరకే వాహనాలు తరలించారని అంటున్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలు ఒక కొలిక్కిరాకుండానే ఇలా చేయడం సీమాంధ్రుల వక్రబుద్ధిని తెలుపుతుందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో విస్తారంగా అడవులు ఉన్నాయని, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో టేకుచెట్ల స్మగ్లింగ్ భారీగా జరుగుతుందని, కొన్నిసార్లు అధికారులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని, స్మగ్లర్లను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో కూడా కొత్త వాహనాల అవసరం ఉండగా సీమకే ఎందుకు వాహనాలు తరలిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తవాహనాలను సీమకు తరలించిన విషయం తెలుసుకున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్ గౌడ్ అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎస్ రెడ్డిని కలిసి ఆటవీశాఖలో జరిగే గోల్ మాల్ పై విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- BJP’s proposal for Godavari-Kaveri river linking project puts Telangana at risk
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్
- భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు