mt_logo

హుస్సేన్ సాగర్ కు కొత్త అందాలు..

హుస్సేన్ సాగర్ చుట్టూ త్వరలో కొత్త అందాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. లక్నవరం తరహాలో హుస్సేన్ సాగర్ అందాలను నీటిపై నుండి నడుచుకుంటూ వీక్షించేందుకు వీలుగా బోర్డు వాక్, పాదచారుల వంతెన ఏర్పాటు చేయనున్నారు. అమోఘం రెస్టారెంట్ నుండి బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ మీదుగా సాగర్ పార్క్ వైపు బోర్డు వాక్ నిర్మాణం జరగనున్నది. హుస్సేన్ సాగర్ సుందరీకరణ, నిర్వహణలో భాగంగా రూ. 38 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టనున్న ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బోర్డ్ వాక్, పాదచారుల వంతెనతో పాటు లోయర్ ట్యాంక్ బండ్ ను ట్యాంక్ బండ్ పైకి వచ్చేందుకు వీలుగా ఆర్ట్ బాక్స్, బస్టాప్ లు, ఆర్ట్ గ్యాలరీలు, శిల్పాలు, పీపుల్ ప్లాజా, ఔట్ డోర్ జిమ్ లు, గ్రీన్ సైడ్ లు నూతనంగా రానున్నాయి. వీటికి సంబంధించి ఇంజినీరింగ్ విభాగం అధికారులు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *