mt_logo

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి..

టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో మైనంపల్లిని గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మైనంపల్లి పేరును ప్రతిపాదించగా మంత్రులు తలసాని, పద్మారావులు బలపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *