mt_logo

ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు హాజరై రేషన్ కార్డుల జారీ, నిత్యావసరాల వస్తువుల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, సమావేశంలో రేషన్ కార్డుల జారీ, సరుకుల సరఫరాపై చర్చించామని, కుటుంబానికి 30 కిలోల బియ్యం అందించే విషయంపై కూడా చర్చించామని తెలిపారు.

చౌకధర బియ్యం కిలో రూ. 3 రూపాయలు చేసే విషయంపై ఆలోచనలు జరిపామని, దసరా తర్వాత మరోసారి భేటీ అయ్యి పూర్తి నివేదికను రూపొందిస్తామని, సీఎం ఆమోదం తర్వాత విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ఈటెల వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *