mt_logo

‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ అవార్డు పొందిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్

రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ అవార్డు పొందారు. పచ్చని ప్రకృతి కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సంతోష్ కుమార్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తాజ్ డెక్కన్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్‌ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) సంస్థ అందిస్తున్న ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’  అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. అధికారిక కార్యక్రమాల వల్ల అవార్డు స్వీకరణకు ఎంపి సంతోష్‌కుమార్ అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో- ఫౌండర్ రాఘవ, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కెజి బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *