mt_logo

మానవత్వం చాటిన మంత్రి కేటీఆర్.. క్షతగాత్రులకు స్వయంగా సహాయక చర్యలు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొని తన పెద్ద మనసు చాటారు. వివరాల్లోకి వెళితే.. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోగా… అటువైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్‌ తన కాన్వాయ్‌ దిగి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను హుటాహుటిన తన కాన్వాయ్‌ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన ఆరోగ్య సేవలందేలా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్డు మీద వెళ్లేవారు అక్కడ ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే.. మంత్రి హోదాలో ఉండి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను స్వయంగా దగ్గరుండి ఆసుపత్రికి చేర్చిన కేటీఆర్ ను సోషల్ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *