mt_logo

దేశహితం కోసం జాతీయ రాజకీయాల్లోకి అడుగు : మంత్రి కేటీఆర్ 

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో గుణాత్మ‌క మార్పు కోసం జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నార‌ని తెలిపారు. ఆనాడు ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం విప్ల‌వాత్మ‌క పంథాను అనుస‌రించారో, ఇవాళ దేశ‌హితం కోసం నూత‌న రాజ‌కీయ ఒర‌వ‌డిని కేసీఆర్ ప్రారంభిస్తున్నార‌ని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక అనుమ‌తితో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని వెల్ల‌డించారు. ముందే నిర్ణ‌యించ‌బ‌డిన రెండు కీల‌క‌మైన పెట్టుబ‌డి స‌మావేశాల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *