mt_logo

సిరిసిల్లను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం : మంత్రి కేటీఆర్

పేదరికం అన్ని కులాలు, మతాల్లో ఉందని, పేదవారు ఏ కులంలో ఉన్నా.. వారికి న్యాయం చేయాలనేదే తెరాస ప్రభుత్వ ఆలోచన అని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృధ్ధి పథకాలను రూపొందిస్తున్నారన్నారని, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి రైతు కుటుంబానికి రూ. 5లక్షల బీమా సదుపాయం కల్పించాన్నారు. రైతుబంధు కూడా ఈ నెల 28నుంచి రైతుల ఖాతాల్లో పడనున్నాయన్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ పంట ల రైతుబంధు కలుపుకుని రూ.58వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయన్నాని తెలియజేసారు. 75 సంవత్సరాల పాలనలో రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను ఎవరూ అమలుపర్చలేదని అన్నారు. స్వయంగా రైతు అవడం వల్లే సీఎం కెసిఆర్ నాయకత్వంలో ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు.

సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చేపట్టిన చెరువుల అభివృధ్ధి వల్ల జిల్లాలో భూగర్భ జలాలు.. ఆరు మీటర్ల ఎత్తుకు ఉబికి వచ్చాయని, ముస్సొరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రి అకాడమీలో ఐఏఎస్ శిక్షణార్థులకు సిరిసిల్ల నీటి సంరక్షణ విధానాన్ని పాఠ్యాంశంగా చేర్చారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హమీ ఇచ్చినట్లు రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాల భవనం త్వరలో ప్రారంభం కానుందన్నారు. సర్దాపూర్ వద్ద వ్యవసాయ పాలిటెక్నిక్ నడుస్తోందన్నారు. త్వరలోనే సిఎం కెసిఆర్ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారన్నారు. అగ్రహరంలోని డిగ్రీ కళాశాలలో జెఎన్‌టియు సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నామని, వీటికి సంబంధించి పెద్దూరులో త్వరలోనే స్వంత భవనాలు ఏర్పాటవుతాయన్నారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌లో త్వరలో డిగ్రీ కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పారు. సిరిసిల్లలో 2009లో మొదటిసారిగా శాసనసభ్యునిగా పోటిచేసిన నాడు తాను మంత్రిని అవుతానని అనుకోలేదని, సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాల వల్ల మంత్రి నయ్యానని, సమాజంలో గుర్తింపు వచ్చిందని, అంతర్జాతీయంగా అనేక నగరాలు తిరిగే అవకాశాలు వచ్చాయన్నారు. సిరిసిల్ల వారందరివాడిగా, పొత్తుల సద్దిగా మారి పనిచేస్తూ ముందుకు పోతానన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా సిరిసిల్లను, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ ప్రాయంగా నిలుపుతానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *