mt_logo

మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 46 లోని మంత్రి గౌతవ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘నాకు గౌతమ్ రెడ్డి మంచి మిత్రుడు, మాకు 12 సంవత్సారాలుగా అనుబంధం ఉందని, 50 ఏళ్ల వయస్సులోనే చనిపోయారన్న వార్త వినగానే షాక్ కు గురయ్యా. మంచి భవిష్యత్ ఉన్న నాయకుడు మరణించడం బాధాకరం అని అన్నారు. వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *