కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రారంభించిన పల్లెప్రగతి వల్లే ఇది సాధ్యమయిందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటామని, ప్రశంసలు అందుకుంటామని చెప్పారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు, 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను మంత్రి కేటీఆర్ అభినందించారు.