కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెటిఆర్తో పాటు టిఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, సురేశ్రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐటి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంత్రి కేటీఆర్ ఈ భేటీ సహృదయపూర్వకమైన వాతావరణంలో సాగిందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. మరోవైపు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో చేశారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్