mt_logo

రాయదుర్గంలో స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాయదుర్గం మెట్రోస్టేషన్‌, రహేజా మైండ్‌స్పేస్‌ ఐటీ కారిడార్‌ను కలుపుతూ కిలో మీటరు పొడవున మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ రూపకల్పన చేసిన స్కై వాక్‌ను సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కిలో మీటరు పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రోజుకు 30వేల మంది దీనిపై ప్రయాణించగలరని, మైండ్‌ స్పేస్‌ ఐటీ కారిడార్‌ను కలుపుతూ వృత్తాకారంలో ఆకర్షణీయంగా నిర్మించినట్లు తెలిపారు. స్కైవాక్‌కు 6 స్టెయిర్‌ కేస్‌లు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అందుబాటులో ఉన్నాయని, దివ్యాంగులు సైతం అత్యంత సులభంగా దీనిపై ప్రయాణించగలరని మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ సీఈవో వినోద్‌ రోహిరా తెలిపారు. స్కై వాక్‌ల మధ్యలో ఇంటర్‌ సెక్షన్‌లో వింటేజ్‌ కేఫ్‌ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *