mt_logo

లైఫ్‌సైన్సెస్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధితో దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీ నడుస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్‌ యూరోలతో ఫెర్రింగ్‌ కంపెనీ ఏర్పాటయిందన్నారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. స్విట్జర్లాండ్‌ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *