mt_logo

కార్యకర్త కుమార్తె వివాహానికి 3 లక్షల ఆర్థిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా కార్యకర్త కుమార్తె వివాహానికి 3లక్షల ఆర్థికం సహాయం చేసి, వారి కుటుంబానికి అండగా నిలిచారు. పెద్దమనసు చాటుకున్నారు మంత్రి కేటీఆర్. మూడేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త మందాటి కొమురయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుకు ఎదుర్కొంటోంది. ఇటీవల కొమురయ్య కుమార్తె అంజలి వివాహం కూడా నిశ్చయం కావడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కొమురయ్య కుటుంబానికి 3 లక్షల ఆర్థికసాయం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య, మంత్రి పీఏ కుంబాల మహేందర్‌రెడ్డితో కలిసి అంజలికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి నవ వధువుకు పుస్తెమట్టెలను వితరణ చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య కుటుంబీకులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *