mt_logo

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ : మంత్రి కేటీఆర్

దేశంలోనే అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు రాష్ట్ర ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. అలాగే తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ ఏడున్నర ఏండ్ల పాలనలో తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 20 ఏండ్ల క్రితం హైదరాబాద్లో పెద్దగా కంపెనీలు లేవని, ఇప్పుడు హైదరాబాద్లో అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణలు, స్టార్టప్ లను బాగా ప్రోత్సహిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ బాగా విజయవంతమైందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, 500 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న పరిశ్రమలకు సత్వర అనుమతి ఇస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విజయవంతం చేసిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేశాం. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ప్రతి ఎకరాకు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ గణనీయమైన అభివృద్ధి చెందిందని, మార్కెట్లు తెలంగాణకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. పంజాబ్ కంటే అధికంగా వరి ధాన్యాన్ని మనమే పండించామని చెప్పారు. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు లబ్ధి చేసే చర్యలు తీసుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి కోసం రైతుబంధు కింద సంవత్సరానికి రెండుసార్లు ఎకరాకు 5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. గత ఏడేండ్లలో రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచామని పేర్కొన్నారు. గ్రీనరీ పెంపులో హైదరాబాద్ దేశంలోనే అగ్రభాగాన ఉందనివ్ మంత్రి కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *