mt_logo

‘మీ సేవ’ ద్వారా రోజుకి లక్షమందికి సేవలు : ఇ-గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్

నేడు హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరుగుతున్న 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ – 2022 సదస్సులో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహిస్తూ… ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఎలక్ట్రానిక్ రంగంలో అనేక విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయాల అనుభవాలు ఇతర రాష్ట్రాలతో పంచుకోడానికి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో మొబైల్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రంలో ‘మీ సేవ’ ద్వారా రోజుకు లక్షమంది పౌరులకు సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే టీ-వ్యాలెట్ ద్వారా కూడా వివిధ సేవలు అందిస్తున్నామని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఎలాంటి సహకారం గానీ, ప్రోత్సాహకం గానీ అందడం లేదని వాపోయారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, తిరిగి దానిని మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ విన్నవించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కూడా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ లో స్పేస్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. వీటితోపాటు ఇన్ స్పేస్ క్లస్టర్ కూడా మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *