సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే నిలిచిపోయే పథకం అన్నారు. ఒకప్పుడు తాగడానికే గుక్కెడు నీళ్లు దొరకని సంగారెడ్డి జిల్లాకు నేడు గోదావరి నది నీళ్లు వెనుకకు నడిచి వచ్చి నీళ్లిచ్చే లాగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అడుగు పెట్టిన నెల సస్యశ్యామలం అవుతుందని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో మన జిల్లాకోసం ఏ నేత కూడా ఆలోచించించలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. రోడ్లు బాగు చేసుకున్నాం. ఇక మిగిలింది ఒక్కటే సాగు నీరు ఒకటే. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ మనం నోరు తెరిచి అడగక ముందే సీఎం గారే స్వయంగా మన కోసం ఈ ప్రణాళిక ఆలోచించి సంగమేశ్వర, బసవేశ్వర పథకాన్ని నాలుగు వేల కోట్లతో శ్రీకారం చుట్టారు. ఎక్కడో 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుండి మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుండి సింగూరుకు అక్కడి నుండి జహీరాబాద్, నారాయణ ఖేడ్, జోగిపేటకు నీటిిని అందించే మహత్తర కార్యక్రమం సీఎం కేసీఆర్ తలపెట్టారు. బోరెంచకు పిల్లనివ్వవద్దు- హత్నూరకు ఎద్దునివ్వవద్దు అని ఈ ప్రాంతంలోని సామెత. నీటి కరవు వల్ల ఈ సామెత ఇక్కడ పుట్టింది. సీఎం కేసీఆర్ దయతో తాగు నీరు వచ్చింది. ఈ సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టు సాగు నీటితో ఆ పరిస్థితి మారుతోంది. సీఎం కేసీఆర్ దయతో 8 రెసెడెన్షియల్ స్కూల్, 15 సబ్ స్టేషన్లు, మార్కెట్ యార్డులు ఏర్పడ్డాయి. 54 తండాలను పంచాయతీలుగా మారాయి. నారాయణఖేడ్ దశ-దిశ మారిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్