mt_logo

మరికాసేపట్లో షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ సభ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కారు అన్ని పార్టీలకన్నా ముందే దూసుకుపోతుంది. రోజుకు రెండు, మూడు బహిరంగసభలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే అగ్రభాగాన నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో కొద్దిసేపట్లో టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. కేసీఆర్ హాజరుకానున్న ఈ సభకు భారీ సంఖ్యలో తెలంగాణవాదులు తరలివస్తున్నారు.

ఇప్పటికే షాద్‌నగర్‌ పట్టణమంతా గులాబీమయమైంది. సభాప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. షాద్‌నగర్‌లో ప్రచారసభ ముగిసిన తర్వాత చేవెళ్లలో జరిగే బహిరంగసభకు కేసీఆర్ హాజరుకానున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రేపు ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేయనున్నారు. భైంసా, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, ఉట్నూర్, ఇచ్చోడలలో ప్రచారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *