మల్లన్న సాగర్ కేవలం రిజర్వాయర్ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జల హృదయం సాగరం అని అభివర్ణించారు ముఖ్యమంత్రి కేసీఆర్. బుధవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ను ప్రారంభించుకోవడం సంతోషకరమని,‘‘మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నామన్నారు. ఈ మహాయజ్ఞంలో 58 వేల మంది కార్మికులు పని చేశారని, వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంజినీర్లు పదవీ విరమణ పొందినప్పటికీ ఎండనకా, వాననక, రాత్రింబవళ్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేశారని, వారందరికీ సీఎం కేసీఆర్ సెల్యూట్ అన్నారు. మంత్రి హరీశ్రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కొందరు దుర్మార్గులు కోర్టుల్లో దాదాపు 600కు పైగా కేసులు వేశారని, రాష్ట్ర చీఫ్ జస్టిస్కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరగా… ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడమన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పామని, చెప్పిన విధంగా గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేయబోతున్నామని అన్నారు. ఎంతో మనసు పెట్టి, అవినీతిరహితంగా ఈ ప్రాజెక్టు కోసం పని చేశామని, ఇది ఒక మల్లన్న సాగర్ మాత్రమే కాదని… తెలంగాణ జన హృదయం సాగరం, తెలంగాణ మొత్తాన్ని గోదావరి జలాలతో అభిషేకించే సాగరమని వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును నిర్మించారని కొనియాడారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని, 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!