mt_logo

మల్లన్న సాగర్ ఆవిష్కరణ… సాగునీటి చరిత్రలో సువర్ణాధ్యాయం : మంత్రి కేటీఆర్

మల్లన్న సాగర్ ఆవిష్కరించే ఈరోజు సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్ ద్వారా 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల తలరాతను మార్చే ప్రాజెక్టుగా మల్లన్నసాగర్‌ను అయన అభివర్ణించారు. తక్కువ సమయంలోనే గొప్ప పని మన కళ్లముందు సాక్షాత్కరించిందని తెలిపారు. సిఎం కెసిఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమైందన్నారు. మల్లన్నసాగర్ పూర్తి కావడంతో పాటు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండటంతో రైతులకు వరప్రదాయనిగా మల్లన్నసాగర్‌ను పేర్కొనవచ్చని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నలకు సాగునీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న, చేయనున్న కృషికి ఈ మల్లన్నసాగర్ నిదర్శనమని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *