తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని(NRI TRS- USA) ఈ నెల 18న నాథ్ ఆడిటోరియం, మిన్నియాపోలిస్ నగరంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెరాస పార్టీ నేతలు ప్రకటించారు. NRI TRS- USA ప్రవాస తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక వారధిగా పని చేస్తుందని నాయకులు తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకలకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల తెరాస ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని వారు తెలిపారు. 18వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలకు కార్ల ర్యాలీతో బయలుదేరి కవిత గారు సభాస్థలికి చేరుకుంటారని, తెలంగాణా వాదులు, పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనం మరియు సభ అనంతరం బాణాసంచా ఏర్పాటు చేయనున్నారు. సభ ఏర్పాట్లను నాగేందర్ మహీపతి(Mobile:847-452-5000) గారు పర్యవేక్షిస్తున్నారు.

