mt_logo

కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ఎంఎస్ఎంఈల అభివృద్ధి: కేటీఆర్ 

పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది తాను చెబుతున్న లెక్క కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిందన్నారు. 

కేసీఆర్‌పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్ధలు చెప్పావని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. 

ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఈరోజు విడుదలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ గారి హయాంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందనటానికి కాంగ్రెస్ చెప్పిన లెక్కలే నిదర్శనమన్నారు. 

గత పదేళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి రేటు 11 శాతం నుంచి 15 శాతం ఉందని ప్రభుత్వమే ఒప్పుకుందని కేటీఆర్ చెప్పారు. 2018-2023 మధ్యలో టీఎస్ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115 శాతం ఉన్నాయి. జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాలో 10 శాతం వృద్ధి చెందింది. ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15 శాతం పెరిగింది. ఎంఎస్ఎంఈల కారణంగా ఉపాధి 20 శాతం పెరిగింది. 

ఎంఎస్ఎంఈల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు 30 శాతం ఉద్యోగాలు పొందారు. 2020-2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డ రాష్ట్రం తెలంగాణ. ఇవి బీఆర్ఎస్ చెబుతున్న లెక్కలు కాదని…కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కనేనని కేటీఆర్ చెప్పారు. 

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ వంటి ప్రగతిశీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందన్నారు. కేసీఆర్ గారి తక్కువ చేయాలనుకొని కురచ బుద్దితో విమర్శలు చేసినంతా మాత్రాన నిజాలు దాగవని అన్నారు. 

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో.. కేసీఆర్ గారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నది అంతే నిజమని కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమో ఒప్పుకోకతప్పదని చెప్పారు.