mt_logo

కేటీఆర్ తో ఐటీ ఉద్యోగుల భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావుతో ఐటీ ఉద్యోగులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో ఐటీ విస్తరణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచే ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుపై వివరాలను ఇండస్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా కాన్సులేట్ అధికారులతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు.

మరోవైపు కేంద్రం ఇచ్చే పన్ను రాయితీ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని, ఈ అంశం రాష్ట్ర ఏర్పాటు బిల్లులో స్పష్టంగా ఉందని కరీంనగర్ ఎంపీ బీ వినోద్ స్పష్టం చేశారు. పన్ను రాయితీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అన్నది నిజం కాదని, పారిశ్రామిక వేత్తలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *