దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడంతో పాటు ఢిల్లీ ప్రజలు సరైన తీర్పునిచ్చారని తెలిపారు. ప్రజలు సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి చెప్పి భిన్నంగా ఆలోచిస్తున్నారనడానికి ఈ ఫలితాలు ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రజలు అవినీతి రహిత, పారదర్శక పాలన కోరుకుంటున్నారని, కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
కేజ్రీవాల్ 70 స్థానాలకు గానూ 67 స్థానాల్లో గెలుపొంది రికార్డుల్లోకి ఎక్కారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లను ఊడ్చిపారేసిన కేజ్రీవాల్ ఒక సామాన్య వ్యక్తి. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఈరోజు ఢిల్లీ సీఎం పీఠం చేజిక్కించుకుని ఈ నెల 14న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.