mt_logo

అవినీతి లేకుండా ప్రభుత్వ అధికారులు పనిచేయాలి..

డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈరోజు విద్యాశాఖ అధికారులతోసమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని, అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. కళాశాలల ఫలితాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించే నిధులను త్వరగా వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు అన్ని ప్రొఫెషనల్ కళాశాలల సమాచారం సేకరించి ఒక ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరచాలని అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *