బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఈరోజు శాసనమండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్రం ప్లానింగ్ కమిషన్ ను రద్దుచేసి నీతి ఆయోగ్ ను తీసుకొచ్చింది. గతంలో కేంద్ర నిధుల కోసం అవసరం లేనివి నిర్మించారు. దాంతో కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. కేంద్రం నిధులిచ్చినా వాడుకోకుంటే అసమర్ధ రాష్ట్రం కింద జమ కడ్తరు. కేంద్రం నుండి నిబంధనలు లేని ఫండ్ రాష్ట్రానికి రావాలి. కేంద్రంతో కరుకుగా వ్యవహరించకుండా తప్పులను ఎత్తి చూపాలని ఆన్నారు.
నీతి ఆయోగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రులంతా సభ్యులేనని, ముఖ్యమంత్రుల సూచనలతోనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నీతి ఆయోగ్ లో సూచించామని సీఎం చెప్పారు. ఎఫ్ఆర్ జీఎంను పెంచడంతో కేంద్రం నుండి అవసరం మేరకు ఆరున్నర వేల కోట్లు అప్పు తీసుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ఆర్ధిక నిపుణులతో కలిసి చర్చిద్దాం. మన హక్కుల కోసం పోరాడాల్సిందే. అవసరమైతే అన్ని పార్టీల ప్రతినిధులంతా కలిసివెళ్ళి ప్రధాని, ఆర్ధికమంత్రి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్లను కలుద్దామని కేసీఆర్ పేర్కొన్నారు.