తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 13సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి మట్టిని పరమ పవిత్రంగా భావించి ముడుపు కట్టారు. దీనికి కారణం 2001 లో ఆ గ్రామ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరి మిగతా పార్టీలను, తెలంగాణ వ్యతిరేక పత్రికలను గ్రామం నుండి వెలివేశారు. ఆ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లా పర్యటన నిమిత్తం అక్కడికొచ్చిన కేసీఆర్ అక్కడి మట్టిని ముడుపుకట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ ముడుపును విప్పనని వాగ్ధానం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ రోజు కేసీఆర్ మోతె గ్రామానికి వెళ్లి ముడుపును నెత్తిన పెట్టుకుని సభావేదికపైకి వెళ్లి అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ముడుపును విప్పారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో గ్రామస్తులు, కార్యకర్తలు హాజరై బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనమైన స్వాగతం పలికారు. మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- MLC Kavitha lodges complaint against Tihar Jail authorities over insufficient amenities
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు