తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 13సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి మట్టిని పరమ పవిత్రంగా భావించి ముడుపు కట్టారు. దీనికి కారణం 2001 లో ఆ గ్రామ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరి మిగతా పార్టీలను, తెలంగాణ వ్యతిరేక పత్రికలను గ్రామం నుండి వెలివేశారు. ఆ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లా పర్యటన నిమిత్తం అక్కడికొచ్చిన కేసీఆర్ అక్కడి మట్టిని ముడుపుకట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ ముడుపును విప్పనని వాగ్ధానం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ రోజు కేసీఆర్ మోతె గ్రామానికి వెళ్లి ముడుపును నెత్తిన పెట్టుకుని సభావేదికపైకి వెళ్లి అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ముడుపును విప్పారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో గ్రామస్తులు, కార్యకర్తలు హాజరై బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనమైన స్వాగతం పలికారు. మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!