వరంగల్ లోని కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా కరుణాకర్ రెడ్డి నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలాఉండగా వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న రూ. 7 కోట్ల మెస్ ఛార్జీలు కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.