Mission Telangana

కొత్త బిచ్చగాళ్ళలా ప్రతిపక్షాలు- ఎంపీ సీతారాం నాయక్

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో కడిపికొండ నుండి కాజీపేట వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో విపక్షాల తీరు కొత్త బిచ్చగాళ్ళ తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఒక్కరే అని ఆయన ప్రశంసించారు. వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సీతారాం నాయక్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే తెలంగాణ మొత్తం వరంగల్ వైపే చూస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పించన్లు ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహాలకు రూ. 51 వేలు ఇస్తున్నామని చెప్పారు. 16 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని మంత్రి వివరించారు. ఉప ఎన్నికలో ప్రజలు ఏం తీర్పు ఇస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారని, పసునూరి దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కేటీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *