అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అడుగుపెడతామని టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతుందని, సీమాంధ్ర నేతలు పిచ్చిపిచ్చి వ్యాఖ్యానాలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఫిబ్రవరి 5నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశబెట్టనున్నట్లు ఢిల్లీ నుండి తనకు స్పష్టమైన సమాచారం అందిందని, బిల్లు ఆమోదం పొందే తేదీలు కూడా తనకు తెలుసని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందగానే పెద్దఎత్తున సంబురాలు చేసుకుందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. వేయిమందికిపైగా తెలంగాణ బిడ్డల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. సీమాంధ్ర నేతలంతా తెలంగాణ ద్రోహులే అని అసెంబ్లీలో నిరూపితమైందని, ప్రజలు వారిపట్ల ఏహ్యభావం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సీఎం, చంద్రబాబు వారి స్థాయికి తగ్గట్లు ప్రవర్తించట్లేదని, రాష్ట్రపతి అధికారాలనే ప్రశ్నిస్తున్నారని ఎండగట్టారు. బిల్లు తిరస్కరించబడలేదని, అభిప్రాయాలు, సవరణలతో పాటు సీఎం తీర్మానాన్ని కూడా పంపిస్తున్నట్లు స్పీకర్ చెప్పినా, సీమాంధ్ర చానళ్ళు పనిగట్టుకొని విషప్రచారం చేయడం జుగుప్సాకరంగా ఉందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో కేంద్రానికే ఉన్నతాధికారాలు ఉన్నాయని తెలిసికూడా సీమాంధ్ర నేతలు ఇరుప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదన్నారు. మెజారిటీ అభిప్రాయంతోనే రాష్ట్రం విడిపోవాలి అంటే ఇక జన్మలో రాష్ట్రం ఏర్పడదు. ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, సుప్రీంకోర్టుకు కూడా ఈ విషయంలో అధికారం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంటుందని, వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన వివరించారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని, ఢిల్లీ వెళ్లి ఆమెను కలిసి కృతజ్ఞతలు చెబుతామని, అన్ని పార్టీల అగ్రనేతలను కూడా కలిసి తెలంగాణకు మద్దతు కోరుతామని చెప్పారు. ఇప్పటికే బీజేపీ సహా అన్ని జాతీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, తప్పకుండా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో తాను తప్పక ఉంటానని, అమరుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వ్యవసాయదారులకు భూమిని ఇస్తామని వాగ్ధానం చేశారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్