mt_logo

సభలో చర్చ లేదు. రచ్చనే!

ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగిపోయింది. బిల్లును వెనక్కు పంపాలని సీఎం ఇచ్చిన నోటీస్‌ను అంగీకరించొద్దని స్పీకర్ పోడియాన్ని తెలంగాణ ప్రాంత నేతలు చుట్టుముట్టారు. ఎంతచెప్పినా వినకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా అదే పరిస్థితి నెలకొనడంతో సభను స్పీకర్ మళ్ళీ గంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడ్డ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనా సభను నడిపే అవకాశం లేకపోవడంతో సభ రేపటికి వాయిదా వేయాల్సివచ్చింది. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలోనే ఉండి బిల్లుపై ఓటింగ్ పెట్టే వరకు సభను దాటి బయటికి వచ్చే ప్రసక్తేలేదని ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *